ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కరోనా పరీక్షలు చేయించుకొండి' - news on corona patients in prakasam

దిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వల్ల దర్శి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించి కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

dsp guided about corona
కరోనాపై అవగాహన కల్పిస్తోన్న దర్శి పోలీసులు

By

Published : Jun 14, 2020, 11:32 AM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం గ్రామాన్ని దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు సందర్శించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దిల్లీ నుంచి ఇటీవల ఒంగోలుకు వచ్చాడు. అతనికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయంపై డీఎస్పీ అతని కుటుంబీకులతో మాట్లాడారు. ఆ వ్యక్తి గురించి ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని డీఎస్పీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details