వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆధార్ను ఫోన్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, జాండ్రపేటలోని మీసేవ కేంద్రాలు, బ్యాంకుల వద్దకు అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. కరోనా వేళ నిబంధనలు గాలికొదిలేసి… భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.
అనుసంధానం సరే.. కరోనా నిబంధనలు పాటించకపోతే ఎలా?!
ప్రకాశం జిల్లాలోని మీసేవ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ అనుసంధానం చేయించుకునేందుకు వచ్చారు. కరోనా నిబంధనలు పాటించకుండా గుంపులుగా నిలబడ్డారు.
బారులు తీరిన మహిళలు
Last Updated : May 23, 2021, 7:47 AM IST