ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 13, 2019, 2:15 PM IST

ETV Bharat / state

కేసీఆర్.. చర్చల ప్రసక్తి లేదనడం సరికాదు: రాఘవులు

తెలంగాణలో సమ్మె చేస్తున్న కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చించాలని సీపీయం నేత బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.

cpm-leader-bv-raghavulu-comments-on-telangana-rtc-employess-strike


తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీయం నేత బీవీ రాఘవులు తప్పుబట్టారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పటం సరికాదని అభిప్రాయపడ్డారు. కార్మికులను చర్చలకు పిలవాలని, వాళ్ల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం మాట్లాడుతున్న విధానానికి పోలికే లేదని దుయ్యబట్టారు.

కార్మికులతో సీఎం కేసీఆర్ చర్చలు జరపాలి: బీవీ రాఘవులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details