ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా ఆకలి తీరేందుకు వలస వెళ్లాల్సిందే..! - cows facing water problems in yarragondapalem

వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్న వేళ మూగజీవాలకు మేత దొరకడం లేదు. జనవరి చివర్లోనే పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పశువులు మేతకై పచ్చగడ్డి, తాగునీటికి ఇక్కట్లు లేని.... కృష్ణా డెల్టా వైపు పశువులను రైతులు తీసుకెళ్తున్నారు.

cows facing water   problems
యర్రగొండపాలెంలో ఆకలి కోసం ఆవుల వలస

By

Published : Feb 2, 2020, 12:09 PM IST

యర్రగొండపాలెంలో ఆకలి కోసం ఆవుల వలస

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని తండాల్లో కొందరు పశువుల యజమానులు, కాపరులు వందల సంఖ్యలో గోవులను తోలుకుని ఆయకట్టు ప్రాంతానికి బయలుదేరారు. వేసవి రాక ముందే పశువులకు మేత కరువైందని... అందుకోసం వలస వెళ్తున్నామని కాపరులు తెలిపారు. వర్షాలు కురిస్తే తమ ప్రాంతాలకు తిరిగి వస్తామని పశు యజమానులు చెబుతున్నారు. జనవరి చివర్లోనే పశువులకు మేత దొరక్కపోవడంపై ఆవేదన చెందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details