ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సద్భావన... ముద్దాయిలకు కౌన్సిలింగ్! - ప్రకాశం జిల్లాలో దొంగలకు కౌన్సిలింగ్ వార్తలు

దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులకు ప్రకాశం జిల్లా పోలీసులు.. సద్భావన పేరుతో కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

Counseling for thieves as part of goodwill in Prakasam district
ప్రకాశం జిల్లాలో సద్భావనలో భాగంగా ముద్దాయిలకు కౌన్సిలింగ్

By

Published : Sep 28, 2020, 10:46 PM IST

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సద్భావన అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పుడుతున్న ఇద్దరు దొంగలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

ఈ క్రమంలోనే.. అద్దంకికి చెందిన పూరాలశెట్టి భూపతి, తెల్లబోయిన రామకృష్ణ దొంగతనాలు చేస్తున్నట్లుగా గుర్తించామని దర్శి డీఎస్పీ ఎకె.ప్రకాశ్ రావు అన్నారు. వీరు అద్దంకి మండలం పార్వతీపురంలోని ఓ దేవాలయంలో హుండీ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details