ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చీరాల ఆసుపత్రిలో కొవిడ్​ బాధితులకు వైద్యం అందించండి'

By

Published : Jul 24, 2020, 4:32 PM IST

జిల్లాలో కొవిడ్​ పాజిటివ్​ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్​ కేసులతో ఒంగోలు రిమ్స్​ ఆసుపత్రితో సహా మిగతా ప్రైవేటు వైద్యశాలలు నిండినాయి. చీరాలలో ఉన్న వందపడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్​ చొరవ తీసుకుని సదుపాయాలు అందిస్తే... చీరాల, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లోని బాధితులకు వైద్యం అందుతుందని స్థానికులు అభిప్రాయాలు తెలియజేశారు.

corona positive cases increasing in chirala mandal
చీరాలలో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రకాశం జిల్లాలో 257 కేసులు నమోదయ్యాయి. గురువారం వచ్చిన ఫలితాల్లో ఈ విషయాన్ని వైద్యాధికారులు తెలియజేశారు. అందులో చీరాలలో 39 మందికి కరోనా పాజిటివ్​ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చీరాల పట్టణానికి వచ్చే రహదారుల్లో పోలీసుల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఒంగోలు రిమ్స్​తో సహా ప్రైవేటు వైద్యశాలలు కొవిడ్​ బాధితులతో బెడ్లు నిండిపోయాయి.

ప్రస్తుతం కరోనా అనుమానితులకు మాత్రమే చీరాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వంద పడకలున్న చీరాల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్​ చొరవ తీసుకుని వెంటిలేటర్లు, ఆక్సిజన్​ సిలిండర్లు ఏర్పాటు చేస్తే... ఇక్కడ కూడా కొవిడ్​ బాధితులకు వైద్యం అందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details