నీటి దొంగ కేసీఆర్కు.. జగన్ ఎలా సహకరిస్తారు? - cm on ycp
రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవాలని ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మోదీ, కేసీఆర్కు వత్తాసు పలికే వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
![నీటి దొంగ కేసీఆర్కు.. జగన్ ఎలా సహకరిస్తారు?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2900972-1008-62346eb2-30e0-49d4-bc11-f4c213502db7.jpg)
ఐదేళ్లలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు.ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని మోదీ,కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.మోదీ,కేసీఆర్కు వత్తాసు పలికే వ్యక్తి జగన్ అని అన్నారు.జగన్పై అనేక కేసులున్నాయి,అందుకే కేసీఆర్ అంటే భయమని ఎద్దేవా చేశారు.రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాంటి కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తారా?అంటూ ప్రశ్నించారు.ఏపీ నీటిదొంగ కేసీఆర్కు...జగన్ ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు.జగన్ జుట్టు మోదీ,కేసీఆర్ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు.