ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నికి ఆహుతైన బస్సు... ప్రయాణికులు సురక్షితం - latest news bus fired in prakasam district

ప్రకాశం జిల్లా పామూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు...లింగారెడ్డిపల్లె వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల అప్రమత్తతో...డ్రైవర్​తో సహా నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

bus fired in lingareddypalli of prakasam
లింగారెడ్డిపల్లెలో అగ్నికి అహుతైన బస్సు... ప్రయాణికులు సురక్షితం

By

Published : Nov 27, 2019, 7:10 AM IST

లింగారెడ్డిపల్లెలో అగ్నికి అహుతైన బస్సు... ప్రయాణికులు సురక్షితం

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లె వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులంతా అప్రమత్తం కావడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పామూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఇంజిన్‌ నుంచి పేలుడు శబ్ధం వచ్చింది. వెంటనే డ్రైవర్‌ను ప్రయాణికులు అప్రమత్తం చేశారు. బస్సును రోడ్డు పక్కన నిలిపేశారు. డ్రైవర్​తో సహా నలుగురు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. లగేజీలు తీసుకోడానికి వీలుకాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఓ ప్రయాణికుడికి చెందిన రూ.1.28 లక్షల నగదు మంటల్లో కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details