ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం... లారీ ఢీ కొని బాలుడు మృతి - news updates in prakasam district

ప్రకాశం జిల్లా వెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాలుడు రోడ్డు దాటుతుండగా... వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ...రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

boy death in a road accident at vellampalli prakasham district
వెల్లంపల్లిలో లారీ ఢీ కొని బాలుడు మృతి

By

Published : Dec 7, 2020, 2:12 AM IST

రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొని బాలుడు మృతి చెందిన ఘటన... ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం వెల్లంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యశ్వంత్.... రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలంలోనే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.

ఈ ప్రమాదంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై వేగ నియంత్రికలు ఏర్పాటుచేయాలంటూ ఆందోళన చేశారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

ఏలూరు బాధితుల్లో వింత ప్రవర్తన... ఆందోళనలో నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details