ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలలలో ప్రైవేటు పాఠశాలల కన్నా ఉత్తమ విద్య అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు సహకరించాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. పూర్వ విద్యార్థుల సాయంతో పుస్తకాల పంపిణీ జరిగింది.

By

Published : Jun 29, 2019, 12:18 PM IST

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల కేంద్రంలోని కడియాల యానాదయ్య ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం 15వేల ఆర్థిక సహాయం ఇస్తుందన్నారు. ప్రతి తరగతి గదిలో కంప్యూటర్, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న ఏడాదిలో ప్రతి విద్యార్థి ఎదిగేందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. ఈ ఏడాది ప్రకాశం జిల్లా పదవ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచి మంచి ప్రగతిని సాధించింది అని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు అన్నారు. పూర్వ విద్యార్థి కిరణ్ అందించిన 25 వేల విలువైన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇది చూడండి.రైతులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు: బాలకృష్ణ


ABOUT THE AUTHOR

...view details