అద్దంకిలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు - అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు
ప్రకాశం జిల్లా అద్దంకిలో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సీతారామయ్య, ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, డాక్టర్ విజయేంద్ర, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.