ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 5, 2020, 3:44 PM IST

ETV Bharat / state

'మైనింగ్​కు​ కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చారు'

ప్రకాశం జిల్లాలో మైనింగ్​కు కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చారని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం....గురువారానికి(రేపు) వాయిదా వేసింది.

ap high court
ap high court

ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్​ప హైకోర్టు విచారణ జరిపింది. ఒంగోలు- టంగుటూరు మధ్య మైనింగ్​కు కేటాయించిన 1367 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించారని పిటిషనర్ వాదించారు. ఆ భూమి మైనింగ్​కు అనుకూలం కాదని పిటిషనర్ తండ్రే చెప్పారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అతను తన తండ్రి కాదంటూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పిటిషనర్​ జత చేశారు. ఈ క్రమంలో మరింత సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details