ప్రకాశం జిల్లా శింగరకొండ క్షేత్రంలో నిర్వహిస్తున్న వార్షిక తిరునాళ్ల, బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ప్రసన్నాంజనేయస్వామి మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించి.. బంగారు ఆభరణాలతో విశేష అలంకరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
కనులపండువగా రథోత్సవం..
సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. సుందరంగా అలంకరించిన రథంలో.. పూజాదికాల అనంతరం ఉత్సవ మూర్తులను ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వెంపరాల బృందం చెక్క భజన, కేరళ కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అన్ని సామాజిక సత్రాల్లో హరే రామ నామ సంకీర్తన నిర్వహించారు. రథోత్సవానికి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బాచిన కృష్ణచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.