ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Maha Padayathra: ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం - amaravathi maha padayatra latest news

అమరావతి రైతుల మహా పాదయాత్రకు పూల వర్షంతో పల్లె జనులు స్వాగతం పలుకుతున్నారు. పది రోజులు పూర్తి చేసుకున్న యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో సాగింది. ఉదయం 9 గంటలకు దుద్దుకూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాచపూడి, కల్లగుంట మీదుగా సాయంత్రం నాగులుప్పలపాడు చేరుకుంది. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని రైతులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు మద్దతుగా తరలిరాగా.. 4 కి.మీ మేర జన జాతరను తలపించింది.

Maha padayatra
Maha padayatra

By

Published : Nov 10, 2021, 10:40 AM IST

Updated : Nov 11, 2021, 7:02 AM IST

ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం

అమరావతి రైతుల మహా పాదయాత్రకు పూల వర్షంతో పల్లె జనులు స్వాగతం పలుకుతున్నారు. పది రోజులు పూర్తి చేసుకున్న యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో సాగింది. ఉదయం 9 గంటలకు దుద్దుకూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాచపూడి, కల్లగుంట మీదుగా సాయంత్రం నాగులుప్పలపాడు చేరుకుంది. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని రైతులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు మద్దతుగా తరలిరాగా.. 4 కి.మీ మేర జన జాతరను తలపించింది. మరోవైపు మఫ్టీలో ఉన్న పోలీసులు ఫొటోలు తీస్తూ, డ్రోన్‌తో వీడియో చిత్రీకరిస్తూ కనిపించారు. అమరావతికి మద్దతు తెలుపుతూ ప్రజలు తమ వెంట తెచ్చుకున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘నాటి స్వాతంత్య్ర సమరయోధుల అసలైన వారసులు నేటి అమరావతి రైతులు’, ‘వృథా పోదు తల్లి మీ కష్టం, ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం’, ‘మూడు రాజధానులు వద్దు...ఒకే రాజధాని ముద్దు’ వంటి బ్యానర్లు కనిపించాయి. ఖమ్మంకు చెందిన ప్రకాశరావు దంపతులు ఆలోచింపజేసే బ్యానర్‌తో యాత్రలో పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని రాచపూడి వద్ద స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు స్వాగతం పలికారు.

అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..

పూల దారిపై నడిపిస్తూ..

సంఘీభావం తెలపడానికి వస్తున్న మహిళలు మహా పాదయాత్రకు గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 700 కాయలు వినియోగించారు. దుద్దుకూరు నుంచి రాచపూడి వరకు 4 కి.మీ మేర పూల మార్గం ఏర్పాటు చేశారు. పర్చూరు, అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, రవికుమార్‌, శ్రీబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ముత్తముల అశోక్‌రెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌, డేవిడ్‌రాజు, ఐకాస నేత కొటికలపూడి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుడు జ్యోతుల నెహ్రూ తదితరులు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్నారు.మరోవైపు బుధవారం ఒక్క రోజే యాత్రకు రూ.60 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. అద్దంకి నియోజకవర్గ ప్రజలు రూ.36 లక్షలు, ఎమ్మెల్యే రవికుమార్‌ బృందం రూ.10లక్షలు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ.10 లక్షలు విరాళమిచ్చారు.

రాజకీయ పార్టీలు పాల్గొంటే చర్యలు: ప్రకాశం ఎస్పీ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చినట్లు ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో యాత్రలో రాజకీయ పార్టీలు పాల్గొనరాదన్నారు. పార్టీలు పాల్గొన్నా, రాజకీయపరమైన ఎజెండాను దానిలో చొప్పించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

13న ఐటీ ఉద్యోగుల చలో మహా పాదయాత్ర

రాజధాని రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఐటీ ఉద్యోగులు 13న యాత్రలో పాల్గొననున్నారు. 12 రాత్రి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి, 13 ఉదయం ప్రకాశం జిల్లా ఎర్రజర్లలో రైతుల పాదయాత్ర ప్రదేశానికి చేరుకుంటారని అమరావతి పరిరక్షణ సమితి హైదరాబాద్‌ కన్వీనర్‌ ప్రవీణ్‌ తెలిపారు. యాత్రలో పాల్గొనాలనుకునే వారు జేఏసీ సభ్యులను(80956 12417) సంప్రదించాలని పేర్కొన్నారు.

తెలంగాణలోని ఖమ్మం ప్రశాంతినగర్‌కు చెందిన ప్రకాశరావు, తులసమ్మ దంపతులు వీరు. అమరావతి రైతులకు మద్దతుగా బుధవారం మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, న్యాయం గెలవాలని నినదించారు. రైతులను అభినందిస్తూ, వారికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. చేతిలో బ్యానర్‌ పట్టుకొని యాత్రలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Maha Padayathra: అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..

Last Updated : Nov 11, 2021, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details