ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి గ్రేడ్ పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలి' - వెల్లంపల్లిలో లాక్​డౌన్

లాక్ డౌన్ కారణంగా.. పొగాకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో.. ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు.

addhanki MLA  examined the tobacco auction center in vellampalli
వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన అద్దంకి ఎమ్మెల్యే

By

Published : May 14, 2020, 9:56 AM IST

లాక్​డౌన్ కారణంగా పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్వయంగా పరిశీలించారు. పండించిన పంట సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ధరలు పూర్తిస్థాయిలో పడిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రైతులను దృష్టిలో ఉంచుకొని సరైన ధరకు పంటను కొనుగోలు చేయకపోతే రానున్న రోజుల్లో పొగాకు పండించే రైతు కనిపించడన్నారు. తక్కువ రంగు వచ్చిన పొగాకును కూడా కొనుగోలు చేస్తే రైతులు కొంతవరకు నష్టాల నుంచి బయట పడతారని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details