ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేకల మందను తప్పించబోయి కారు బోల్తా... ముగ్గురికి స్వల్ప గాయాలు

అనంతపురం నుంచి గుంటూరుకు వెళ్తున్న కారు మాచవరం వద్ద మేకల మందను తప్పించబోయి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.

By

Published : Jul 13, 2020, 2:55 PM IST

accident happend and car rolled down near kanigiri mandal machavaram village
మాచవరం గ్రామం వద్ద కారు బోల్తా

మేకల మందను తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు బోల్తా పడ్డ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామం దగ్గర చోటు చేసుకుంది. కారులోని ముగ్గురు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతపురం నుంచి గుంటూరుకు వెళ్తుండగా మాచవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. హఠాత్తుగా మేకల గుంపు జాతీయ రహదారిపైకి రావడం వల్ల... వాటిని తప్పించబోయి కారు బోల్తాపడిందని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details