ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 11, 2022, 7:32 PM IST

Updated : Jun 11, 2022, 9:14 PM IST

ETV Bharat / state

చెరువులో స్నానానికి దిగి.. నలుగురు బాలురు మృతి!

death
death

19:25 June 11

చెరువులో స్నానానికి దిగి నలుగురు పిల్లలు మృతిచెందారు. ఈ విషాద సంఘటన.. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జరుగుమిల్లి మండలం అక్కచెరువుపాలెం గ్రామ శివారులోని చెరువులో.. ఆరుగురు విద్యార్థులు స్నానికి దిగారు. ప్రమాద వశాత్తూ.. ఆరుగురూ నీటిలో మునిగిపోయారు. వారిలో ఇద్దరు బాలికలను స్థానికులు కాపాడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగతా నలుగురు బాలురు మృతదేహాలను చెరువులో నుంచి వెలికి తీశారు.

చనిపోయిన వారిని కౌశిక్‌(16), సుభాష్‌(11), సుబ్రహ్మణ్యం (15), హరి భగవన్నారాయణ(10)గా గుర్తించారు. ఒకే గ్రామంలో నలుగురు చిన్నారులు మృతి చెందడంతో అక్కచెరువుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పరామర్శించారు.

Last Updated : Jun 11, 2022, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details