మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని నిలపాలని వైకాపా నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు తన కుమారుడు విక్రమ్ రెడ్డితో కలిసి తాడేపల్లికి వచ్చిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్తో సమావేశమయ్యారు. గౌతమ్ రెడ్డి వారసుడిగా తన రెండో అబ్బాయి విక్రమ్ రెడ్డిని నిర్ణయించినట్లు రాజమోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి వెళ్లేముందు సీఎం జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. తన అన్నయ్య వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నానన్నవిక్రమ్..., అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. నియోజకవర్గానికి అన్నయ్య చేయాలనుకున్నదాన్ని తాను చేసి చూపిస్తానన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్: రాజమోహన్ రెడ్డి - mekapati vikram reddy news
మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా తన రెండో అబ్బాయి విక్రమ్ రెడ్డిని నిర్ణయించినట్లు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తన కుమారుడు విక్రమ్ రెడ్డితో కలిసి తాడేపల్లికి వచ్చిన రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్తో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి వెళ్లేముందు సీఎం జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్