ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 10, 2020, 10:13 PM IST

ETV Bharat / state

108 అంబులెన్స్​లో ప్రసవించిన మహిళ

నెల్లూరు జిల్లా కొల్లాపూర్ నాయుడుపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ 108 అంబులెన్స్​లో ప్రసవించింది. గ్రామానికి చెందిన మమత అనే గర్భిణీకి పురిటినొప్పులు ఎక్కువై అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

108 అంబులెన్స్​లో ప్రసవించిన మహిళ
108 అంబులెన్స్​లో ప్రసవించిన మహిళ

108 అంబులెన్స్​లో మహిళ ప్రసవించిన ఘటన నెల్లూరు జిల్లా కొల్లాపూర్ నాయుడుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కత్తి మమత అనే గర్భిణీకి గత అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్​కు సమాచారం అందించగా...వెంటనే చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది పొదలకూరు ఆసుపత్రికి బయల్దేరారు. కాగా మార్గమధ్యంలో గర్భిణీకి పురిటినొప్పులు ఎక్కువై వాహనంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాము ఫోన్ చేయగానే హుటాహుటిన చేరుకుని ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడిన 108 సిబ్బందికి గర్భిణీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details