నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో ప్రస్తుతం75టీఎంసీల నీరు చేరిందని అధికారులు ప్రకటించారు. దీంతో జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది.పెన్నా నది ఎగువ ప్రాంతాల నుంచి30వేల క్యూసెక్కుల నీరు జలశయంలోకి చేరుతోంది.దిగువ కండలేరు వరద కాలువకు10వేల500క్యూసెక్కులు,పెన్నా నదిలోకి5500క్యూసెక్కులు,ఉత్తర కాలువకు700క్యూసెక్కులు,దక్షిణ కాలువకు350క్యూసెక్కులు నీటిని అధికార్లు విడుదల చేస్తున్నారు.జలాశయం సామర్ధ్యం78టీఎంసీలు కాగా..ఈరోజు 11, 12 గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని తాగు సాగు కోసం కిందకు వదిలారు.ఈ సందర్భంగా అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, సంగం తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు.
నిండుకుండలా సోమశిల జలాశయం - సోమశిల జలాశయం వార్తలు
సోమశిల జలశయానికి వరదనీరు చేరి నిండుకుండలా కనిపిస్తోంది. నీటి నిల్వ 78టీఎంసీలు కాగా ఇప్పటికీ 75 టీఎంసీల నీరు చేరిందని అధికార్లు ప్రకటించారు.తాగునీటి కోసం నీటిని దిగువకు వదులుతున్నారు.
![నిండుకుండలా సోమశిల జలాశయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4726076-1068-4726076-1570851775933.jpg)
The Somashila reservoir filled with full of water The Somashila reservoir filled with full of water
Last Updated : Oct 12, 2019, 1:39 PM IST