రాష్ట్రంలో ఎక్కడి చూసినా విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి..పారిశుద్ద్యలోపం ప్రజలను భయంకరమైన రోగాలభారిన పడేస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో
పశ్చిమగోదావరి జిల్లా మెట్ట మండలాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.గ్రామాల్లో పారిశుధ్యం లోపించి నివాసల మధ్య నీరు నిలిచి వాటి నుంచి వచ్చిన దోమలు కుట్టి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.తమ సమస్యను అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లా కదిరిలో లక్షకుపైన జనాభా ఉన్నా...ఆ స్థాయిలోనే మురికివాడలు ఉన్నాయి.పట్టణంలోని కుటాగుళ్ల,అడపాల వీధి,నిజాంవలి కాలనీ,మశానం పేట ప్రాంతాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది.ప్రభుత్వ వైద్యశాల చికిత్స అందక ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి భారీగా సమర్పించుకున్నారు ప్రజలు.పారిశుద్ధ్య సిబ్బంది సరిగా రావటంలేదని ఫిర్యాదు చేస్తున్నారు స్థానికులు.
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు పంచాయతీలో తాగునీరు కలుషితమై రోగాల భారిన పడుతున్నామంటున్నారు ప్రజలు.వెంటనే అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు గ్రామస్థులు.
నెల్లురు జిల్లాలో