ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య

By

Published : May 21, 2021, 7:33 PM IST

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు ఆయూష్ ఇన్​ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్​కు సూచించారు.

vc Venkaiah Naidu on Nellore Ayurvedic medicine
vc Venkaiah Naidu on Nellore Ayurvedic medicine

కరోనా చికిత్స కోసం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. వనమూలికలు, ఇతర పదార్థాలతో తయారు చేస్తున్న ఔషధాన్ని ఆనందయ్య అనే వ్యక్తి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి చేరాయి. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. వెంటనే ఆయూష్ ఇన్​ఛార్జి మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్​తో ఫోన్​లో మాట్లాడారు. ఆయుర్వేదం ఔషధంపై అధ్యయనం చేయాలని.. వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని వారికి సూచించారు.

ఇదీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details