ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి.. తాగి దాడికి దిగారు' - venkatachalam mpdo sarala comolaint against mla kotamreddy

ఆమె గ్రూప్ వన్ స్థాయి మహిళా అధికారి. అధికార పార్టీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారని ఫిర్యాదు చేసేందుకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్​కు వచ్చారు. అర్ధరాత్రి మహిళా అధికారి స్టేషన్​కు వచ్చినా ఫిర్యాదు స్వీకరించే వారే కరవయ్యారు. రాత్రి 11 గంటలకు వచ్చిన ఆమె స్టేషన్ ఆవరణంలోని ఓ అరుగుపై బైఠాయించి ఉదయం 4.30 గంటల వరకూ వేచి ఉన్నారు.

ఎంపీడీవో నిరసన

By

Published : Oct 5, 2019, 6:22 AM IST

Updated : Oct 5, 2019, 7:04 AM IST

తన ఇంటిపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఆరోపించారు. వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో ఎమ్మెల్యే అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన లే-ఔట్‌కు... పంచాయతీ వాటర్‌ కనెక్షన్‌ ఇవ్వాలని శ్రీధర్​రెడ్డి తనను అడిగారని సరళ చెబుతున్నారు. ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా... 3 రోజుల క్రితం ఫోన్‌లో బెదిరించారని అన్నారు. నిన్న రాత్రి మద్యం సేవించి..తాను లేని సమయంలో ఇంటిపైకి వచ్చారని ఆరోపించారు. తన ఇంటి ఎదుట చెత్తకుండీ పెట్టి... కరెంట్​ కట్​ చేయించారని వాపోయారు. కుళాయి కనెక్షన్​ కూడా తొలగించేందుకు గుంతను సైతం తీశారని తెలిపారు. తన కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురై తనకు చరవాణిలో సమాచారమిచ్చారని పేర్కొన్నారు.

అందుబాటులో లేని అధికారులు

జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో నెల్లూరు పోలీస్​ స్టేషన్​కు అర్ధరాత్రి వెళ్లగా అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ఉదయం 4.30 గంటల వరకూ స్టేషన్​ ఆవరణలోనే బైఠాయించారు. దాదాపు ఐదు గంటలు వేచి చూసిన అనంతరం అక్కడికి వచ్చిన ఎస్సై సాంబశివరావుకు తన ఫిర్యాదును అందజేశారు. ఒక గ్రూప్​-1 స్థాయి అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల గతేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి:

బంగ్లాలో బందీలుగా.. విజయనగరం మత్స్యకారులు

Last Updated : Oct 5, 2019, 7:04 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details