ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య - AP crime news

Murder : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు హత్యకు గురయ్యారు. నెల్లూరు నగరంలోని ఉడ్ హౌజ్ సంగం వద్ద గత రాత్రి మహేష్ అనే యువకుడిని కత్తులతో నరికారు. మహేష్ స్నేహితులతో క్యారమ్​ ఆడుతుండగా కొంతమంది ముసుగులు ధరించి వచ్చారు. విచక్షణా రహితంగా కత్తులుతో దాడి చేశారు. మహేష్​ను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. అలాగే పల్నాడు జిల్లాలో కూడా దారుణ హత్య జరిగింది. దాచేపల్లి పట్టణం మోడల్ స్కూల్ సమీపంలోని మిర్చి తోటలో ఒక వ్యక్తిని(45) గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి తోటలోనే బాడీని పూర్తిగా దగ్ధం చేసిన అగంతకులు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 25, 2023, 9:34 PM IST

Murder : ఆంధ్రప్రదేశ్​లో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైన ఘటనలు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కోటేశ్వరరావు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేశారు.

నెల్లూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని ఉడ్ హౌస్ సంఘం వద్ద రాత్రి మహేష్ అనే యువకుడిని కత్తులు, తల్వార్​లతో దారుణంగా పొడిచి దుండగులు హతమార్చారు. మహేష్ స్నేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతుండగా ముసుగులు ధరించి వచ్చిన కొందరు దుండగులు విచక్షణా రహితంగా కత్తులు, తల్వార్​లతో నరికి పరారయ్యారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఉన్న మహేష్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న రెండో నగర పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు మహేష్​ను హతమార్చి పరారౌతుండగా స్థానిక సీసీ కెమెరాల్లో విజువల్స్ రికార్డు అయ్యాయి. ఐతే మూడు రోజుల క్రితం తల్పగిరి కాలనీలో ఓ వ్యక్తిని గొంతు కోసి హతమార్చిన సంఘటన మరువక ముందే మరో హత్య జరగడంతో నగరవాసులు భయాందోళనకు గురౌతున్నారు.

పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గం దాచేపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దాచేపల్లి పట్టణం మోడల్ స్కూల్ సమీపంలోని మిర్చి తోటలో కోటేశ్వరరావు(45) అనే వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశారు. మృతుడు కోటేశ్వరరావు దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్( ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్నాడు. ఐతే హత్య చేసిన అనంతరం మిర్చి తోటలోనే బాడీని పూర్తిగా దగ్ధం చేశారు. దీనికి చిన్నపాటి వివాదం పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసిన పోలీసులు. నిందితుడు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు కూడా అదే నగర పంచాయితీలో పంపు ఆపరేటర్​గా పనిచేస్తున్నాడని దాచేపల్లి పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details