ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 7, 2020, 7:23 PM IST

ETV Bharat / state

రైతు ఇంట్లో చోరీ... 20 సవర్ల బంగారం, రూ. లక్ష నగదు అపహరణ

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపాలిటీలోని ఓ రైతు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 20 సవర్ల బంగారం, రూ. లక్ష నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు.

twenty savars of gold and one lakh cash stolen by unknown person in a farmer house at atmakur nellore district
రైతు ఇంట్లో చోరీ... 20 సవర్ల బంగారం, లక్ష నగదు అపహరణ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మసీదు సెంటర్ వద్ద పట్టపగలే దొంగతనం జరిగింది. రైతు కొలకలపూడి కృష్ణారెడ్డి - రమణమ్మ దంపతులు... పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.

ఆసరాగా చేసుకున్న దుండగులు.. ఆ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇటీవలే ధాన్యం అమ్మగా వచ్చిన రూ. లక్ష నగదు, 20 సవర్ల బంగారం పోయినట్టు రైతు కృష్ణారెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details