నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం శాంతినగర్లో దొంగతనానికి ప్రయత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ది చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాంతినగర్ లోని ఓ ఇంట్లోకి కారంపొడి, బ్లేడుతో వెళ్లిన దొంగ చోరీకి ప్రయత్నించాడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి రావడం చూసిన మహిళ అప్రమత్తమైంది. మహిళ అలికిడి తెలుసుకున్న దొంగ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తను తీసుకొచ్చిన కారం పొడి, బ్లేడ్ కింద పడిపోయింది. చాకచక్యంగా వ్యవహరించిన మహిళ... ఆ కారం పొడిని తీసుకొని దొంగపై చల్లింది. గట్టిగా కేకలు వేసింది. ఈ గోలతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి దొంగను పట్టుకున్నారు. చెట్టుకు కట్టి, దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
దొంగను పట్టించింది కారం... స్థానికులు చేశారు ఒళ్లు హూనం...
నెల్లూరు జిల్లాలోని శాంతినగర్లో దొంగతనానికి యత్నింతిన ఓ దుండగుడికి... స్థానికులు దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.
![దొంగను పట్టించింది కారం... స్థానికులు చేశారు ఒళ్లు హూనం... thief was beaten by locals in shanthinagar at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7844730-288-7844730-1593597047470.jpg)
చోరికి యత్నించిన దొంగకు స్థానికుల దేహశుద్ది
చోరికి యత్నించిన దొంగకు స్థానికుల దేహశుద్ది
Last Updated : Jul 1, 2020, 4:13 PM IST
TAGGED:
నెల్లూరులో దొంగతనం వార్తలు