ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లను లూటీ చేసే దొంగ అరెస్ట్ - చిత్తూరులో తాళం వేసిన ఇళ్లు చోరి చేరిన వ్యక్తి అరెస్ట్

తాళం వేసిన ఇళ్లను పగటి పూట లూటీ చేసే ఓ దొంగను నెల్లూరు జిల్లాలో... పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 316 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Thief arrested for looting locked houses in nellore district
తాళం వేసిన ఇళ్లను లూటీచేసే దొంగ అరెస్ట్

By

Published : Nov 7, 2020, 6:47 PM IST

తాళం వేసిన ఇళ్లను పగటి పూట లూటీ చేసే ఓ దొంగను నెల్లూరు జిల్లాలో... పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ నుంచి రూ.15 లక్షలు విలువైన 316 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 22న సైదాపురం మండలం అనంతమడుగులోని ఓ ఇంట్లో చోరీ జరగటంతో... ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిత్తూరు జిల్లా తొట్టంబేడుకు చెందిన పరుశురాం అనే వ్యక్తి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిని అరెస్టు చేశారు. రూ.15లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగ సైదాపురం, గూడూరు, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి ప్రాంతాల్లో 7 ఇళ్లలో చోరీ చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details