నెల్లూరు జిల్లా అనంతసాగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రామాలయం, అభయాంజనేయ స్వామి, వినాయక స్వామి, సాయిబాబా ఆలయాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 4 ఆలయాల్లో స్వామివారి హుండీలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు.
హుండీలు ఆలయం వెనుకపడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. చోరీ జరిగిందని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన నెల వ్యవధిలో 9 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు స్దానికులు తెలుపుతున్నారు.
కృష్ణాజిల్లా నూజివీడులోని ఓ దేవాలయంలో అర్ధరాత్రి అగంతకులు హుండీ దొంగిలించిన ఘటన సంచలనం రేపింది. కొత్తూరు గ్రామంలోని శ్రీరామమందిరంలోగల హుండీని గుర్తు తెలియని అగంతకులు అర్ధరాత్రి దొంగిలించారు.