ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాలి లేని ఫైనాన్స్ కంపెనీ... దివ్యాంగుడి వాహనాన్ని తీసుకెళ్లి... - నాయుడు పేట స్టేషన్​లో దివ్యాంగుడి వార్తలు

అతనో దివ్యాంగుడు. అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా తన మూడు చక్రాల మోటర్​ సైకిల్​పై పండ్లు అమ్ముతూ..ఇంటింటికి పేపర్​ వేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కరోనా వైరస్​ వల్ల పరిస్థితి అంతా తలకిందులైంది. జీవనోపాధి కరవై..ఇంటి అద్దె చెల్లించలేక చివరికి తన మోటార్​ సైకిల్​పై రుణం తీసుకున్నాడు. చేయటానికి పనులు దొరకకపోవటంతో వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోయాడు. ఫైనాన్స్ కంపెనీ వారు దివ్యాంగుడిపై ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై అతన్ని వదిలి పెట్టి వాహనాన్ని తీసుకెళ్లారు.

the finance company that took disabled vehicle at naidu pet
జాలి లేని ఫైనాన్స్ కంపెనీ... దివ్యాంగుడి వాహనాన్ని తీసుకెళ్లి...

By

Published : Jan 22, 2021, 7:10 PM IST

Updated : Jan 22, 2021, 7:52 PM IST

రోడ్డుపై దివ్యాంగుడిని వదిలి వాహనాన్నితీసుకెళ్లారు

వాయిదాలు చెల్లించలేదని ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థ దివ్యాంగుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కనికరం లేకుండా నాయుడుపేట రైల్వే స్టేషన్​ ఆవరణలో వదిలి అతని వాహనాన్ని తీసుకెళ్లారు. దిక్కుతోచని స్థితిలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆ దివ్యాంగుడు స్టేషన్​ ఆవరణలో కాలం వెల్లదీస్తున్నాడు.

నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్​లో మునికృష్ణ అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. తనకున్న మూడు చక్రాల వాహనంపై పండ్లు అమ్ముతూ..పేపర్​ వేస్తూ జీవిస్తున్నాడు. కరోనా వైరస్ వల్ల ఉపాది కోల్పోయాడు. పనుల్లేక ఇంటి అద్దె చెల్లించేందుకు దివ్యాంగుడు మూడు చక్రాలు మోటారు సైకిల్​పై రూ.17వేలు రుణం పొందాడు. దివ్యాంగుడనే కనీస కనికరం లేకుండా.. వాయిదా కట్టలేదని అతన్ని నడిరోడ్డుపై దించేసి వాహనం తీసుకెళ్లారు. నెల రోజులు గడువు కోరనా కనికరించలేదు.

ఇదీ చదవండి:రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ

Last Updated : Jan 22, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details