ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనభేరి సభకు సంఘీభావంగా నెల్లూరులో తెదేపా దీక్ష

నెల్లూరులో తెదేపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రైతు దీక్షలకు ఏడాది పూర్తయినందున నిర్వహిస్తున్న జనభేరి సభకు సంఘీభావంగా కార్యక్రమం దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

By

Published : Dec 17, 2020, 9:24 PM IST

tdp leaders protest
నెల్లూరులో తెదేపా దీక్ష

అమరావతి రైతులకు సంఘీభావంగా నెల్లూరులో తెదేపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రైతు దీక్షలు ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నగరంలోని తెదేపా కార్యాలయంలో కార్యక్రమం జరిపారు. తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నగర ఇంఛార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. జనభేరి సభకు వెళ్లనివ్వకుండా నోటీసులివ్వటం అన్యాయమన్నారు. రాజధానితో అంశంతో పాటు అన్ని విషయాల్లోనూ సీఎం జగన్ మాట తప్పారని విమర్శించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details