ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా హయాంలో కార్పొరేషన్లు నిర్వీర్యం.. సబ్ ప్లాంట్ నిధులు పక్కదారి'

వైకాపా అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో కార్పొరేషన్​ల పరిస్థితి అధ్వానంగా తయారైందని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య మండిపడ్డారు.

By

Published : Jul 14, 2021, 5:11 PM IST

Published : Jul 14, 2021, 5:11 PM IST

negligence of corporations
వైకాపా హయాంలో కార్పొరేషన్లు నిర్వీర్యం

ముఖ్యమంత్రి జగన్​ పాలనలో దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య అన్నారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని చెప్పారు. ఈ మేరకు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా తీరుపై మండిపడ్డారు.

కార్పొరేషన్​లను నిర్వీర్యం చేసి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాంట్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దళితులపై ఇంతటి నిర్లక్ష్యం వహించడం మంచి పద్ధతి కాదని.. సీఎం జగన్​ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో జగన్మోహన్ రెడ్డి గట్టెక్కారని.. పద్ధతి మారకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు దళితులు, మైనారీ, బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details