ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 13, 2020, 9:57 AM IST

ETV Bharat / state

దాటాలంటే ఊరు.. అడ్డొస్తోంది ఏరు!

చెరువులకు నీరందించే వాగులు.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. నివర్‌, బురేవి తుపాన్ల ప్రభావంతో కొన్నేళ్ల తరువాత భారీ వర్షాలు కురవటంతో.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని పలు వాగులు ఉప్పొంగాయి. రహదారులపై ఏర్పాటు చేసిన చప్టా మీదుగా ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. పలువురి ప్రాణాలు బలిగొంటున్నాయి. ఫలితంగా ఆయా కుటుంబాలకు తీవ్ర వేదనను మిగులుస్తున్నాయి.

water on roads
దాటాలంటే ఊరు.. అడ్డొస్తోంది ఏరు!

చెరువులకు నీరందించే వాగులు.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని పలు వాగులు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటీవలి వర్షాలకు చినక్రాక జలాశయం కలుజు నుంచి వచ్చే వరద నీటితో జలదంకి వద్దనున్న చిప్పలేరు నిండు కుండలా ప్రవహిస్తోంది. సమీప కమ్మపాలేనికి చెందిన దివ్యాంగుడు మాలేపాటి శ్రీనివాసులు చప్టా మీదుగా జలదంకి వైపు వెళుతూ.. అదుపు తప్పి చిప్పలేరులో గల్లంతయ్యాడు. 4 రోజులు గడిచినా అతని జాడ లేక.. తల్లి వరమ్మ నిద్రాహారాలు మాని కుమారుడి కోసం ఎదురుచూస్తోంది.

వారధులు లేనందువల్లే..

కృష్టాపాడు, చామదల, దాసరి అగ్రహారం, అన్నవరం, చినక్రాక, చామదల, కరకోరిపాలెం గ్రామాల వద్ద వాగులపై వంతెనలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు వరదలొస్తే ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితి వచ్చినా.. రవాణా సదుపాయం లేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినక్రాక జలాశయం కలుజుల నుంచి ప్రవహించే వరద నీరు రహదారులపై ప్రవహిస్తున్నదున.. చినక్రాకతో పాటు అన్నవరం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు అవకాశం ఉండటం లేదు. తుపాన్ల ప్రభావంతో కురిసిన వానలకు దాసరి అగ్రహారం వద్దనున్న వాగు పొంగి.. వారం రోజుల పాటు రాకపోకలు లేవని గ్రామస్థులు తెలిపారు. బిట్రగుంట మీదుగా నెల్లూరుకు వెళ్లే రహదారిపై చామదల గ్రామ సమీపంలో నేరేళ్లవాగు నీరు పారి.. కొన్నాళ్లుగా ఆ మార్గంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పాలకులు మారుతున్నా తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వాగులపై నూతన వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపుతాం..

కమ్మవారిపాలెం ఉబ్బలవాగుతో పాటు దాసరి అగ్రహారం తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు భవనాల శాఖ రోడ్డు పైనున్న వాగులపై వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. నిధులు మంజూరు కాగానే.. నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మా వంతు కృషి చేస్తాం. - నాగేంద్రబాబు, ర.భ.శాఖ డీఈ, కావలి

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

ఇటీవల వర్షాలకు జలదంకి మండలంలో వాగులు ఉప్పొంగి పలువురు గల్లంతైన విషయం తెలిసింది. ఆయా గ్రామాలకు వెళ్లే మార్గాల్లోని వాగులపై వంతెనలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటా. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. వర్షాలతో నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల విషయమై అధికారులతో చర్చిస్తాం. వాటిని బాగు చేయించేలా చూస్తా. - మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి

ఇవీ చదవండి:

వర్షాలకు భారీగా దెబ్బతిన్న రోడ్లు.. నిధుల కొరతతో అరకొరగా మరమ్మతులు

ABOUT THE AUTHOR

...view details