ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీర జవాన్లకు నివాళలర్పించిన సబ్ కలెక్టర్ - latest gudur news

దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు.గూడూరు డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీరజవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి సబ్ కలెక్టర్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ శ్రద్ధాంజలి ఘటించారు.

nellore  district
వీర జవాన్లకు నివాళలర్పించిన సబ్ కలెక్టర్

By

Published : Jun 18, 2020, 6:29 PM IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ల చిత్రపటానికి సిబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఎస్పీ భవనిహర్ష, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు చైనా జవాన్లతో జరిగిన పోరాటంలో 23 మంది మృతి చెందటం బాధాకరమని దీనికి దీటుగా భారతదేశం చైనాకు సమాధానం చూపుతుందని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరి త్యాగాలను ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు.
ఇది చదవండి'కువైట్​లో బతకలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని ఇంటికి చేర్చండి'

ABOUT THE AUTHOR

...view details