ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకోండి: సోమిరెడ్డి - Somireddy Chandramohan Reddy comments on ycp

వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈజీఎస్ నిధులను కేంద్ర విడుదల చేసినా... ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.

Somireddy Chandramohan Reddy fires on ycp over NREGS funds release
సోమిరెడ్డి

By

Published : Nov 17, 2020, 4:25 PM IST

దిగుబడి తగ్గి, మద్దతు ధర దొరక్క నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెట్టడం దారుణమని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అన్నదాతల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారని.. ఒక్కొక్కరికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదన్నారు.

తక్షణమే 170 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటే.. అమాయకులను అరెస్ట్ చేసి వేధించడం సరికాదన్నారు. కొందరు అధికారుల తీరు దారుణంగా ఉందని, వారిని తాము చట్టం ముందు నిలబెడుతామని హెచ్చరించారు.

కేంద్రం విడుదల చేసిన ఈజీఎస్ నిధులను రాష్ట్రం నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పది వేల లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమైనా చర్యలు తీసుకుని ఈజీఎస్ బిల్లులను చెల్లించేలా చూడాలని కోరారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ABOUT THE AUTHOR

...view details