ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 29, 2020, 9:21 PM IST

ETV Bharat / state

హత్య ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్టు

నెల్లూరు జిల్లా భైరవరంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Six accused arrested in connection with murder case in Bairavaram nellore district
హత్య ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్టు

నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం భైరవరం కాలనీలో జరిగిన హత్య ఘటనలో.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెంకటగిరి డీఎస్పీ భవాని శ్రీహర్ష వెల్లడించారు.. తాగునీటి నిర్వహణ విషయంలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు.. మరుసటి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన డీఎస్పీ.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details