ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహపురి స్త్రీ శక్తి వేదికపై గళమెత్తిన తెలుగు మహిళ - జగన్ నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగిన టీడీపీ నేతలు - ఏపీ తాజా వార్తలు

Simhapuri Sthree Sakthi at Nellore : రాష్ట్రంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని సింహపురి స్త్రీ శక్తి వేదికపై పలువులు గళమెత్తారు. వైఎస్సార్​సీపీ హయాంలో జరిగిన దారుణాలను ఎండగట్టారు. మహిళలకు జరిగిన అన్యాయంపై చర్చించారు. చంద్రబాబు, జగన్​ నిరంకుశ పాలనకు మధ్య వ్యత్యాసాలను బయటపెట్టారు.

simhapuri_sthree_sakthi_at_nellore
simhapuri_sthree_sakthi_at_nellore

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:15 PM IST

Simhapuri Sthree Sakthi at Nellore :బాబు మళ్లీ రావాలంటే, ప్రజల కష్టాలు తీరాలంటే మహిళా శక్తి కృషి చేయాలని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, మహిళలకు స్వేచ్ఛలేదంటూ సింహపురి స్త్రీ శక్తి చర్చా వేదికపై వక్తలు ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు నగరంలో సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో సింహపురి స్త్రీ శక్తి చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని. మహిళలకు స్వేచ్ఛ లేదని. మళ్లీ టీడీపీ ప్రభుత్వంలోకి రావాలని. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడే మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తారని చెప్పారు. జగన్ పాలన అంతమైనప్పుడే ధైర్యంగా మహిళలు తిరగగలరని వక్తలు ప్రసంగించారు.

'జే బ్రాండ్‌'తో పేదల ప్రాణాలు తీస్తున్నారు - మహిళలు జాగృతమైతేనే మార్పు : సోమిరెడ్డి

EX- Minister Somireddy Chandramohan Reddy in Simhapuri Sthree Sakthi Meeting :సీబీఎన్ ఫోరం సింహపురి స్త్రీ శక్తి చర్చా వేదికలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని అన్నారు. మహిళల కోసం చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం చేశారని తెలిపారు. జగన్​ మద్యపాన నిషేధం అమలు చేస్తానన్నాడని కానీ చెయ్యకుండా జనాలతో విషపూరిత మద్యం తాగిస్తున్నాడని మండిపడ్డారు. జే బ్రాండ్ లతో పేద కుటుంబాల్లో భర్తల ప్రాణాలు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీ బిడ్డను అంటూ ముఖ్యమంత్రి జగన్ మగవాళ్ళను హింసలు పెట్టి, కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఆడబిడ్డలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు.

సింహపురి ఆసుపత్రి ఇక నుంచి మెడికవర్ హాస్పిటల్!

TDP Leaders in Simhapuri Sthree Sakthi Meeting : టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దుర్మార్గమైన , అరాచకమైన పాలన, రక్షణ లేని పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందన్నారు. విద్యార్ధుల భవిష్యత్ బాగుంటుందని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.

మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ మహిళలు జాగృతమైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందనే విజన్ చంద్రబాబుదని అన్నారు. డ్వాక్రా గ్రూపులు పుట్టుకొచ్చింది బాబు ఆలోచనల నుంచే అని ఆయన తెలిపారు. ఇసుక నిర్వహణను టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు చేప్పట్టారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని సమస్యలకు పరిష్కారం టీడీపీ, జనసేన అధికారంలోకి రావడమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలపై వేధింపులు ఆగుతాయన్నారు.

25న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details