ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమంగా ఇసుక తరలింపు.. ఐదు ట్రాక్టర్లు సీజ్

By

Published : Jun 19, 2020, 7:39 PM IST

నెల్లూరు జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఎక్సైజ్​ పోలీసులు సీజ్​ చేశారు. ఇప్పటివరకు ఇసుక మాఫియాను అరికట్టేందుకు పోలీస్​, రెవెన్యూ అధికారులకు మాత్రమే అధికారం ఉండేందన్న అధికారులు ఇప్పుడు ఎక్సైజ్​ శాఖకు కూడా ఆ అధికారాలు కల్పించారన్నారు.

sand-illegal-transport-five-vehicles-sized
ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బొగ్గేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిపోతుందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎక్సైజ్​ అధికారులు, పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details