ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతం పెంచాలని రేషన్ బియ్యం వాహన డ్రైవర్ల ధర్నా - నెల్లూరు రేషన్ బియ్యం తాజా వార్తలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్ వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న స్థితిలో.. తాము విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

జీతం పెంచాలని రేషన్ బియ్యం వాహన డ్రైవర్ల ధర్నా
జీతం పెంచాలని రేషన్ బియ్యం వాహన డ్రైవర్ల ధర్నా

By

Published : May 3, 2021, 4:35 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట వాహనాల డ్రైవర్​లు ధర్నా చేశారు. ప్రజలకు ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే సిబ్బంది అయిన తాము.. కరోనా వ్యాప్తి విజృంభణతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు సిబ్బంది విధులకు రావట్లేదని.. తద్వారా భారమంతా తమపైనే పడుతుందన్నారు. ఈ మేరకు తమకు భద్రత కల్పించి జీతం పెంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details