ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 11:39 PM IST

ETV Bharat / state

భాజపా కార్యాలయంలో నాయకుల దీక్ష

భాజపా కార్యాలయంలో నిరసన దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని నినాదించారు. పెంచిన విద్యుత్ చార్జిలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

nellore  district
భాజపా కార్యాలయంలో నిరసన దీక్ష...

రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరి నశించాలి. విద్యుత్ చార్జిల్లో అవకతవకలు సరిచేయాలి. ఇవే నినాదాలతో నెల్లూరు భాజపా కార్యాలయంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జిలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన దీక్ష చేపట్టారు.

ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను ఆపాలని పేర్కొనారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, రాష్ట్ర నాయకుడు సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పాల్గొన్నారు.

ఇది చదవండివలస కూలీలపై ప్రమాదాల పంజా - 17 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details