ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శభాష్ పోలీస్.. మళ్లీ మానవత్వం చాటారు! - nellore district police conducted the funeral

నెల్లూరు జిల్లా పోలీసులు మరోసారి శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల ఓ అనాథ శవాన్ని మోసుకువెళ్లిన ఆ పోలీసులు.. ఆ మృతదేహానికి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. వారి మానవత్వాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

police conducted the funeral
అనాథ శవానికి అంత్యక్రియలు

By

Published : Mar 31, 2021, 3:18 PM IST

నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.. తమ విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. వారి మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. అనాథ మృతదేహానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసి పోలీసులు.. మానవత్వాన్ని చాటుకున్నారు.

జెండా చెట్టు వద్ద రాత్రి ఓ వృద్దుడు(65) మృతి చెందాడు. కొవిడ్ కారణంగా ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వన్ టౌన్ పోలీసులు... ఊరి బైట ఉన్న శ్మశానంకు తీసుకుపోయి ఖననం చేశారు.

ABOUT THE AUTHOR

...view details