డిగ్రీ చదువుతున్న యువకుడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటుపడి.. పోలీసులకు చిక్కిన ఘటన నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రావిపాడు గ్రామంలో జరిగింది. ఓ ఇంట్లో జరిగిన దొంగతనంలో.. నిందితుడు 8.94 లక్షల రూపాయల నగదు, 32 గ్రాముల బంగారు నగలు దొంగిలించినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అతడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
వ్యసనాలకు బానిసగా మారి చోరీలు.. పోలీసులకు చిక్కిన యువకుడు - ఈరోజు నెల్లూరు జిల్లా దొంగతనం కేసులు తాజా వార్తలు
నెల్లూరు జిల్లా రావిపాడు గ్రామంలో ఓ ఇంట్లో చోరికి పాల్పడిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. డిగ్రీ చదువుతున్న యువకుడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు.
పోలీసులకు చిక్కిన డిగ్రీ యువకుడు