ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యం.. శ్వాస అందక పోయిన ప్రాణం - నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో శ్వాస అందక వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడకు చెందిన కార్నా వెంకట చలపతి.. శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించినా ప్రాణం దక్కలేదు. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే మృతి చెందాడని.. అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.

naidupeta hospital staff negligence killed a person
ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

By

Published : May 11, 2021, 8:38 PM IST

ఆక్సిజన్ అందక అవస్థలు... నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బంది

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడకు చెందిన కార్నా వెంకట చలపతి అనే వ్యక్తి శ్వాస సమస్యలతో కన్నుమూశాడు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిన స్థితిలో.. అతడి బందువులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంతసేపు చెట్టు కింద, అనంతరం ట్రై సైకిల్ మీద కూర్చోబెట్టారు. చివరికి అక్కడి సిబ్బంది సరిగా పట్టించుకోలేదని.. ఆక్సిజన్ అందక తీవ్రంగా కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబీకులు ఆవేదన చెందారు. ఈ సంఘటన చూపరులను కలిచివేసింది.

ఇదీ చదవండి:అయినా కానీ.. ఖర్చు చేయరు ..!

ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగులు సకాలంలో స్పందించకపోవడం వల్లే వెంకట చలపతి మరణించాడని.. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోడివాక చందు ఆరోపించారు. అతడి మృతికి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కోలుకున్న చోటారాజన్ - తిరిగి తిహాడ్ జైలుకు..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details