ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 24, 2020, 7:38 PM IST

ETV Bharat / state

పచ్చదనానికీ 'లాక్ డౌన్'.. ఎండిపోతున్న చెట్లు!

నెల్లూరు నగరం.. కాలంతో సంబంధం లేకుండా పచ్చదనంతో అలరారేది. కానీ.. 2 నెలలుగా లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా.. రహదారి విభాగినిల మధ్య ఉన్న డివైడర్లలోని వేలాది మొక్కలు ఎండిపోతున్నాయి.

no water to plants at nellore
నెల్లూరులో డివైడర్ మొక్కలు

నెల్లూరులో డివైడర్ మొక్కలు

హరిత ఆంధ్రప్రదేశ్​లో భాగంగా నెల్లూరు నగరాన్ని సుందరంగా మార్చారు. ఐదు నెలలుగా నగరపాలక సంస్థ అధికారుల కృషితో నగరం చుట్టూ పచ్చదనం పరుచుకుంది. కానీ.. 2 నెలలుగా లాక్​డౌన్​లో.... కరోనా జాగ్రత్తల్లో భాగంగా మొక్కలకు నీరు పట్టేవారు లేకపోయారు. కొన్ని చోట్ల మొక్కుబడిగా నీరు పట్టినా.. అది ఏమాత్రం సరిపోక వేలాది మొక్కలు ఎండిపోతున్నాయి.

పొదలకూరు రోడ్డు, కేవీఆర్ పెట్రోలు బంక్, గాంధీ బొమ్మ సెంటర్, హరనాథపురం, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో.. నీరు లేక రహదారి విభాగినుల మధ్యలో ఉన్న మొక్కలు మాడిపోయాయి. ఫలితంగా.. పచ్చదనం కనుమరుగవుతోంది. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా మొక్కలకు నీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details