ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2021, 8:26 PM IST

ETV Bharat / state

రైల్వేట్రాక్​పై నవ వరుడు మృతి

పెళ్లై 45 రోజులు కాక ముందే ఓ వ్యక్తి రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద.. అతడి శరీరం, మొండెం వేరుగా పడి ఉన్నాయి. మృతుడిని నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

mysterious death on beejapur railway track
బీజాపూర్ రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన సాయినాథ్ రెడ్డి.. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని బీజాపూర్ వద్ద రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉద్యోగరీత్యా తెలంగాణలో నివసిస్తుండగా.. అతడి శరీరం, మొండెం బీజాపూర్ వద్ద వేరుగా పడి ఉన్నాయని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతదేహం పక్కనే ద్విచక్రవానంతో పాటు సాయినాథ్ రెడ్డి వస్తువులు పడి వున్నాయి. పెళ్ళై 45 రోజులు కాక ముందే అనుమానాస్పద స్థితిలో అతడు మృతి చెందగా.. కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details