నెల్లూరు నగరంలోని లే క్యూ కాలనీలో నివాసముంటున్న అరుణాచలం(75).. గుండె సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడం లేదు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది సొంత ఖర్చులతో.. వాలంటీర్ రాకేశ్ను చెన్నైకి పంపి వృద్ధునికి పింఛన్ అందేలా చేశారు. సచివాలయ సిబ్బంది ఉదారతను స్థానికులు అభినందించారు.
సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి... పింఛన్ అందజేసిన వాలంటీర్ - nellore district latest news
నెల్లూరు నగరం లే క్యూ కాలనీ సచివాలయ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. అనార్యోగంతో చెన్నైలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుని వద్దకు వెళ్లి పింఛను అందజేశారు. సిబ్బంది ఉదారతను పలువురు కొనియాడారు.
![సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి... పింఛన్ అందజేసిన వాలంటీర్ volunteer donated a pension at chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10473176-1107-10473176-1612266607794.jpg)
సుమారు 180 కిలోమీటర్లు వెళ్లి పింఛన్ అందజేసిన వాలంటీర్