ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దుకాణాలు మూసేస్తే....బిల్లులు ఎలా పెరుగుతాయి'

లాక్​డౌన్ సమయంలో సామాన్యులపై విద్యుత్ బిల్లులు భారం మోపుతున్నారని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయానికి వెళ్లి సమస్యలను అధికారులకు తెలిపారు.

By

Published : May 19, 2020, 4:48 PM IST

nellore tdp leaders protest on  electricity bills
నెల్లూరులో తెదేపా నాయకుల నిరసన

లాక్​డౌన్ కారణంగా హోటళ్లు, బేకరీలు, చిన్నవ్యాపారాలు మూసివేశారని..., వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు ఏ విధంగా వస్తున్నాయని నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విద్యుత్​ అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ శాఖ నెల్లూరు జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఆయన అధికారులకు సమస్యలను వివరించారు. జిల్లాలో అత్యధికంగా వస్తున్న బిల్లులను చూపించారు. విషయాన్ని ఎస్ఈ విజయకుమార్ దృష్టికి తీసుకుపోయారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని ఏడీ, డీఈలకు ఈ సమస్యలు వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details