ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు: హత్య కేసును ఛేదించిన పోలీసులు - murder case chased nellore police

నెల్లూరు సీఏఎం హైస్కూల్ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షలే కారణమని తేల్చారు.

నెల్లూరు హత్య కేసును చేధించిన పోలీసులు
నెల్లూరు హత్య కేసును చేధించిన పోలీసులు

By

Published : Sep 27, 2020, 11:23 PM IST

నెల్లూరులో ఈ నెల 17వ తేదీన షేక్​ బాషా హత్య కేసును పోలీసులు చేధించారు. సీఏఎం హై స్కూల్ ప్రాంతంలోని వాచ్ మెన్ షెడ్ లో షేక్​ బాషా తో పాటు అతని స్నేహితులు అయిదుగురు మద్యం సేవించారు. మత్తులో జారుకున్న తర్వాత షేక్ బాషాను స్నేహితులు కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. స్నేహితులే ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధరించారు. హత్యకు పాల్పడిన సయ్యద్ మొహసిన్ అహ్మద్, జాన్సన్, సమీర్, ఫారుఖ్, ప్రేమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ మొహసిన్ అహ్మద్, షేక్ బాషా మధ్య ఇటీవల గొడవలు జరగడమే ఈ హత్యకు దారి తీసినట్టు సీఐ మధుబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details