ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 25, 2020, 5:54 PM IST

ETV Bharat / state

వాజ్​పేయీకి నివాళులర్పించిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి

మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతిని నెల్లూరు భాజపా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

tributes to Vajpayee
దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతి

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాళులర్పించారు. నెల్లూరులోని భాజపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. వాజ్​పేయీ ఆశయాలను మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని వాకాటి కొనియాడారు.

రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేందుకే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ చట్టాలపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను పక్కదారి పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాల ద్వారా జరిగే మేలును రైతాంగం తెలుసుకోవాలన్నారు.

వ్యవసాయ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చి..రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకించటమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టాలపై కొన్ని పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల మద్దతు మాత్రం భాజపాకే ఉందని..అది ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా రుజువైందన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వాజ్​పేయీ జయంతి

ABOUT THE AUTHOR

...view details