ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 9, 2020, 7:48 PM IST

ETV Bharat / state

'నెల్లూరు జిల్లాలో సోమవారం నుంచి పొగాకు కొనుగోళ్లు'

లాక్​డౌన్ కారణంగా పొగాకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రోజు రోజుకూ సరకు రంగు మారుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. స్పందించిన మంత్రి గౌతమ్ రెడ్డి సోమవారం నుంచి వేలం మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు.

minister
minister

నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్ కారణంగా పొగాకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. పొగకు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించి మర్రిపాడు, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నుంచి వేలం ప్రారంభించేాలా ఏర్పాటు చేయించారు. పొగాకు రోజురోజుకూ రంగు మారి పోయి పాడైపోతుందని రైతులు తమ గోడు చెప్పుకోగా..మంత్రి టొబాకో బోర్డు అధికారులతో చర్చించారు.

జిల్లా కలెక్టర్ కు పొగాకు కొనుగోళ్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఎం.వీ శేషగిరి బాబు జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాలైన, డీసీ పల్లి, కలిగిరిలో కొనుగోళ్లు మే 11వ తేదీ నుంచి ప్రారంభించాలని మార్గదర్శకాలిచ్చారు.

అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. పొగాకు కొనుగోళ్ల సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా రైతులు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాక్సిన్ వచ్చేవరకూ ఈ జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇదీ చదవండి:

కరోనా పరీక్షల్లో రాష్ట్రానికి అగ్రస్థానం: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details