ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2021, 3:36 PM IST

ETV Bharat / state

కొవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి గౌతమ్​ రెడ్డి

నెల్లూరులోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలలో 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రైటర్లను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని బాధితులను పరామర్శించిన ఆయన.. అక్కడ వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

minister gowrtham reddy
minister gowrtham reddy


నెల్లూరులోని ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలను.. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి 50 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన.. బాధితులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details